ఉదంపూర్, జనవరి 6: కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కరోవా జిల్లాలో శనివారం మధ్యాహ్నం రామ్నగర్ నుంచి ఉదయంపూర్కు ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.