హైదరాబాద్, జనవరి 10 : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శీతల పానీయాల సంస్థ పార్లే ఆగ్రో ఫ్రూటీ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకుంది. 2022కల్లా రూ.10వేల కోట్ల టర్నోవర్కు చేరాలని వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం సంస్థకు దక్షిణ భారతం రెండో అతిపెద్ద మార్కెట్ గా భాసిల్లుతుంది. దీంతో ఇక్కడ మార్కెట్ ను మరింత విస్తృతం చేసుకునేందుకు ఈ ప్రచారం తోడ్పడుతుందని సంస్థ జాయింట్ ఎండీ, సీఎంఓ నదియా చౌహాన్ వెల్లడించారు.
పార్లే ఆగ్రో ప్రస్తుతం ఫ్రూటీతోపాటు యప్పీ, ఫ్రూటీ ఫిజ్, యాప్పీ ఫిజ్, బైలీ, ఫ్రియో బ్రాండ్నేమ్లతో శీతల పానీయాలను విక్రయిస్తున్నది. దేశంలో అందరూ ఇష్టపడే ఫ్రూటీకి ప్రచారకర్తగా పనిచేయడం ఆనందంగా ఉందని అల్లు అర్జున్ తెలిపారు.