న్యూఢిల్లీ, జనవరి 12: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) కొత్త బైక్ ను విపణిలోకి ప్రవేశపెట్టింది. 149 సీసీ కలిగిన ఎఫ్జడ్ఎస్-ఎఫ్ఐని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.86,042గా (ఎక్స్ షోరూం ఢిల్లీ) నిర్ణయించింది. ఈ బైక్లో ఎయిర్కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజిన్ ఉంది. ఇందులోని 220ఎంఎం హైడ్రాలిక్ సింగిల్ వెనుక డిస్క్ బ్రేక్, 282 ఎంఎం ముందు బ్రేకులు బైక్ను సమర్థంగా నియంత్రిస్తాయని కంపెనీ తెలిపింది.