అమరావతి, జనవరి 13 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. చైనాకు చెందిన ఆలీబాబా కంపెనీ సీఈవో వండర్యాంగ్ తో భేటీ అయ్యారు. ఆలీబాబా కంపెనీ.. ఏపీ ఉత్పత్తుల విక్రయాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఓ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 20వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. సీఈవో వండర్యాంగ్ ను పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ లోకేష్ వద్దకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలీబాబా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది.