కనకదుర్గమ్మను దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్

     Written by : smtv Desk | Thu, Jan 18, 2018, 02:09 PM

కనకదుర్గమ్మను దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్

విజయవాడ, జనవరి 18 : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఈ రోజు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సమ్మెతంగా విచ్చేసిన సీహెచ్ కు దేవాదాయశాఖ సహాయ కమిషనర్ పుష్పవర్ధన్ ఘనంగా స్వాగతించారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి వేదపండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.





Untitled Document
Advertisements