అమరావతి, జనవరి 19 : "ఇండియాటుడే" చర్చా గోష్టిలో కేసీఆర్ మాట్లాడిన మాటలు నన్నెంతో బాధించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల ఏపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. అంతకు ముందు హైదరాబాద్ అభివృద్ధిని పరిశీలిస్తే అన్ని వాస్తవాలు అర్దమవుతాయని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తమ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుకోగలమని తెలిపారు.