డ్రోన్ @ మేడిన్ ఆంధ్ర..!

     Written by : smtv Desk | Fri, Jan 19, 2018, 04:43 PM

డ్రోన్ @ మేడిన్ ఆంధ్ర..!

అమరావతి, జనవరి 19 : ఏపీ ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మొట్ట మొదటగా తయారుచేసిన డ్రోన్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతి డ్రోన్ల కంపెనీని స్థాపించిన అనంతరం తయారు చేసిన తొలి డ్రోన్‌ ఇదే కావడం విశేషం.

ఈ డ్రోన్ ప్రత్యేకతలను ఐటీ శాఖ మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. తక్కువ ధరకే ఈ డ్రోన్లను తయారు చేస్తున్నామని, మార్కెట్లో దొరికే నాణ్యత కంటే వీటి నాణ్యత చాలా ఎక్కువని తెలిపారు. కాగా ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ భాగస్వామ్యం వహించారు.





Untitled Document
Advertisements