'ఆచారి అమెరికా యాత్ర' ట్రైలర్ విడుదల...

     Written by : smtv Desk | Sat, Jan 20, 2018, 12:33 PM

'ఆచారి అమెరికా యాత్ర' ట్రైలర్ విడుదల...

హైదరాబాద్, జనవరి 20: మంచు విష్ణు కథానాయకుడిగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్నఈ చిత్రంలో బ్రహ్మానందం కీలకమైన పాత్రను పోషించాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర టిజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ ట్రైలర్ లో.. ఖండాతరాలు దాటుకుంటూ ప్రగ్యా జైస్వాల్ కోసం అమెరికాకు వెళ్తాడు ఆచారి విష్ణు. పౌరోహిత్యం చేసే గురు శిష్యులుగా ఉండే విష్ణు, బ్రహ్మానందం అక్కడ వారికీ ఎదురయ్యే సంఘటనలతో ఈ కథ కొనసాగుతుంది. ఒకవైపు యాక్షన్ కామెడీకి ప్రాధాన్యతనిస్తూ, మరోవైపు ప్రగ్యా తో రొమాంటిక్ సన్నివేశాలలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నవ్వుల యాత్రను గణతంత్రం దినోత్సవం సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements