చావనైనా చస్తాను కానీ మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాను: ఖుష్బూ

     Written by : smtv Desk | Sat, Jan 20, 2018, 03:33 PM

చావనైనా చస్తాను కానీ మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాను: ఖుష్బూ

చెన్నై, జనవరి 20: తమిళ ప్రేక్షకుల మదిలో ఆరాధ్య దేవతగా నిలిచిపోయిన నటి ఖుష్బూ తన చిన్ననాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె 'ఇండియాటుడే కాన్‌ క్లేవ్‌' లో మాట్లాడుతూ..."నాకు ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది. 1986 సెప్టెంబరు 12వ తేదీన ఇంట్లో వాగ్వాదం చోటు చేసుకుంది. అమ్మను అనరాని మాటలంటుంటే ఎదురుతిరిగి బయటకు వచ్చేశాను...ఆప్పుడు నువ్వు పాక్కుంటూ వెళ్లి బిక్షాటన చేసి, డబ్బు తీసుకొచ్చి పోషిస్తావా? అని ఆయన అన్నారు. దాంతో నా సోదరుడ్ని, అమ్మను చంపేసి.. నేనూ రైలు కిందపడిపోతానే కానీ మళ్లీ నీ దగ్గరికి తిరిగి రాను అని ఆయనతో సవాల్ చేసి, బయటకు వచ్చేశాను. నాటి నుంచి నేటి వరకు మా నాన్నను చూడాలని ఏ రోజూ అనుకోలేదు, చూడను కూడా" అని చెప్పుకొచ్చారు. ఇందులో ఆమెతో పాటు నటి గౌతమి, తాప్సి, కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు.





Untitled Document
Advertisements