హైదరాబాద్, జనవరి 21: విలక్షణ నటుడు కమల్ హసన్, చియాన్ విక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్త నేడు నిజమైంది. తాజాగా కమల్ హసన్ తన ట్విట్టర్ వేదికగా.. 'మిస్టర్ విక్రమ్, మిస్ అక్షరా హాసన్, దర్శకుడు రాజేశ్ ఎం సెల్వ, రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్తో కలిసి సినిమా తీయబోతున్న త్రిదెన్త్ ఆర్ట్స్కు నా అభినందనలు. సినిమాను మంచి విజయం సాధించే చేసే దిశగా కృషి చేద్దాం' అని ట్విట్ చేశారు. ఈ స్టార్స్ కాంబినేషన్ లో వచ్చే సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.