ముంబాయి, జనవరి 21: తన వైవిధ్యమైన నటనతో అందరినీ కట్టిపడేసే బాలీవుడ్ అగ్రకథానాయిక విద్యాబాలన్, 63వ జియో ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. 'తుమ్హారీ సులు' చిత్రంలో ఓ గృహిణి పాత్రలో అదరగోట్టేసిన తన నటనకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును ప్రముఖ నటి రేఖ బహూకరించారు.
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలందరూ హాజరయ్యారు. బెస్ట్ లీడింగ్ రోల్ (ఫిమేల్) కేటగిరీలో 'బద్రీనాథ్ కి దుల్హానియా'లో పాత్రకు గాను అలియాభట్, భూమి పెడ్నేకర్ (శుభ్ మంగళ్ సావ్ధాన్), సబా ఖమర్ (హిందీ మీడియం), శ్రీదేవి (మామ్), విద్యాబాలన్ (తుమ్హారీ సులు), జైరా వాసిమ్ (సీక్రెట్ సూపర్ స్టార్)లు నామినేట్ అయ్యారు.