ఛాంపియన్ గా నిలిచిన భారత్.. ప్రముఖుల ప్రశంసలు...

     Written by : smtv Desk | Sun, Jan 21, 2018, 01:01 PM

ఛాంపియన్ గా నిలిచిన భారత్.. ప్రముఖుల ప్రశంసలు...

న్యూఢిల్లీ, జనవరి 21 : అంధుల వరల్డ్‌ కప్‌లో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఈ మేరకు భారత జట్టుకు ప్రముఖలు అభినందనలు తెలియజేశారు. వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్లు సచిన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉన్నారు.

* అంధుల ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. జట్టు తమ నైపుణ్యాలను, పట్టుదలను, ఆత్మవిశాస్వాన్ని ప్రదర్శించింది. మీరు సాధించిన విజయానికి జాతి గర్విస్తోంది – రాష్ట్రపతి

* వరల్డ్‌ కప్‌ గెలిచిన మన క్రికెట్‌ జట్టుకు అభినందనలు. మీరు జాతి గర్వపడేలా చేశారు. మీ ఆటతో పాటు సాధించాలనే తపనతో ప్రతీ భారతీయుడికి స్పూర్తిగా నిలిచారు. మీరు నిజమైన చాంపియన్లు – మోదీ

* పెద్దలన్నట్టుగా సంకల్ప బలం ఉంటే విజయం దానంతటదే సిద్ధిస్తుంది. భారత జట్టుకు ప్రణామం. అంధుల ప్రపంచకప్‌ గెలిచినందుకు మొత్తం జట్టు సభ్యులందరికీ నా అభినందనలు - సచిన్‌

* భారత్ జట్టుకు నా అభినందనలు - వీవీఎస్‌ లక్ష్మణ్‌

శనివారం షార్జాలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్‌ 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. 308 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ 10 బంతులు మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.





Untitled Document
Advertisements