గుంటూరు, జనవరి 21: 'గ్రామాల్లో బురద అవుతోందని సిమెంట్ రోడ్లు నిర్మిస్తుంటే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని' ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ.. 'నేను మా ఊరు వెళ్లినప్పుడు చూస్తే అక్కడ ఒక్క మట్టిరోడ్డు కూడా కనిపించడం లేదన్నారు. గ్రామాల్లో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు కావడంతో ప్రజలకు మోకాళ్ల నొప్పుల సమస్య తలెత్తుతుంది' అని అన్నారు. ఈ విషయాన్నీ అందరూ అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.