హైదరాబాద్, జనవరి 22: అటు వెండితెరపై సూపర్ జోడిగా పేరు తెచ్చుకొని, ఇటు నిజ జీవితంలో సూపర్ జోడిగా నిలిచిన జంట మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్. అయితే నేడు మహేశ్ తన సతిమణి పుట్టినరోజు సందర్బంగా, ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. 'నువ్వు నాకెంత ప్రత్యేకమో చెప్పడానికి మరో కారణం. హ్యాపీ బర్త్డే టు మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై వైఫ్' అంటూ మహేశ్ ట్విట్ చేశారు. 'వంశీ' సినిమా సమయంలో మహేశ్, నమ్రత ప్రేమించుకొని, 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు స్వస్తి పలికారు. వీరిద్దరికి గౌతమ్, సితార, పిల్లలు ఉన్నారు.