హైదరాబాద్, జనవరి 22: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా 'నాపేరు సూర్య నాఇల్లు ఇండియా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో బన్ని ఆర్మీ పాత్రలో కనిపిస్తాడు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ కి విశేష స్పందన లభించింది. అయితే ఈ సినిమాను ఏక కాలంలో ఏడూ భాషలలో విడుదల చేయాలనీ చిత్ర బృందం భావిస్తోందట. తెలుగు, తమిళం, మలయాళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్పురి భాషల్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.