ముంబాయి, జనవరి 22: మాజీ మిస్ వరల్డ్ బ్యూటి, అందాల రాశీ ఐశ్వర్య రాయ్ కు అరుదైన అవార్డు దక్కింది. సినీ పరిశ్రమలో విజయవంతంగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆమెకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 'ఫస్ట్లేడీ’ అవార్డును అందజేశారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మొట్టమొదటి మహిళలకు శనివారం రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 'ఫస్ట్లేడీ' అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన ఏకైక భారతీయ నటి ఐష్. ఇందుకు గానూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ.. ఐష్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో 112 మంది మహిళలు ఈ అవార్డును పొందారు.