న్యూఢిల్లీ, జనవరి 22 : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్న వేళ.. ఢిల్లీలో ఓ మహిళ వద్ద దొరికిన బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తోంది.
ఈ క్రమంలో సదరు మహిళ బ్యాగులో బుల్లెట్లను గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను నిలదీశారు. ఆ బుల్లెట్లు తనవేనని ఆ మహిళ తండ్రి పోలీసులకు వెల్లడించారు. తన వద్ద లైసెన్స్ ఉందని ఆ జిరాక్స్ కాపీని అధికారులకు సమర్పించారు. కాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.