ముంబాయి, జనవరి 22: ఎన్నో వివాదాల తరువాత విడుదలకు సిద్ధమైన 'పద్మావత్' చిత్రంపై మరోసారి పిటిషన్ లు దాఖలు అయ్యాయి. రాష్ట్రాల్లో తలెత్తనున్న శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ఆదేశాలను మరోసారి పునఃసమీక్షించాలని కోరుతూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కొత్త పిటిషన్ను వేశాయి. మంగళవారం రోజు ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిశీలించనుంది.
ఈ విషయ౦మై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్పందిస్తూ - సుప్రీం కోర్టు ఆదేశాల్ని పాటించడం తమ బాధ్యత అని, సినిమాను థియేటర్లో ప్రదర్శించడానికి ఇష్టపడకపోతే మంచిదని, ఒకవేళ ప్రదర్శించాలి అనుకునే వారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని అన్నారు.