ఐపీఎల్... మ్యాచ్ వేళల మార్పులపై ఫ్రాంఛైజీల అసంతృప్తి

     Written by : smtv Desk | Tue, Jan 23, 2018, 03:04 PM

ఐపీఎల్... మ్యాచ్ వేళల మార్పులపై ఫ్రాంఛైజీల అసంతృప్తి

న్యూఢిల్లీ, జనవరి 23 : ఐపీఎల్-11 మ్యాచ్ వేళల్లో మార్పులుపై ఆయా జట్ల ఫ్రాంఛైజీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. గత పదేళ్లుగా లీగ్‌లో సాయంత్రం మ్యాచ్‌ 4గంటలకు, రాత్రి పోరు 8గంటలకు ఆరంభమవుతుండగా ఈ ఏడాది 5.30కి, 7గంటలకు మొదలవుతున్నట్లు లీగ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రసార సంస్థనై స్టార్‌ స్పోర్ట్స్‌ సంస్థ కోరిక మేరకే మ్యాచ్‌ వేళల్ని సవరించినట్లు ఆయన చెప్పారు.

ఈ తాజా విధానంపై పలు జట్ల ఫ్రాంఛైజీలు మాట్లాడుతూ.."మ్యాచ్ సమయాల్లో మార్పులు కోసం మేము మీడియా ద్వారా తెలుసుకున్నాము. దీనిపై బీసీసీఐ కనీసం మమ్మల్ని సంప్రదించ లేదు. చివరిగా నిర్ణయం తీసుకునే ముందైనా ఒకసారి మాతో కూడా మాట్లాడి ఉండే బాగుండేది" అని అసంతృప్తి వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements