"వెల్‌కం టు న్యూయార్క్" ట్రైలర్ విడుదల

     Written by : smtv Desk | Tue, Jan 23, 2018, 03:07 PM


ముంబై, జనవరి 23 : టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, కరణ్‌ జోహార్‌, సోనాక్షి సిన్హా ప్రముఖ పాత్రల్లో నటించిన "వెల్‌కం టు న్యూయార్క్‌" అనే చిత్ర ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. చక్రి తొలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతీయ తొలి త్రీడీ కామెడీ చిత్రంగా తెరకెక్కుతుంది. న్యూయార్క్‌లో నిర్వహించే ఓ ఈవెంట్‌కు వీరంతా కలిసి వెళ్తారు. అక్కడ జరిగిన విషయాలను చాలా కామెడీగా చూపించారు.

అయితే ఈ ట్రైలర్ లో కరణ్ జోహార్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తనను కొందరు కిడ్నాప్‌ చేస్తే అతన్ని కాపాడేందుకు వెళ్ళిన రానా.. కరణ్‌ను కాపాడి మోసుకొస్తూ "జై మాహిష్మతి" అని అరవడం ప్రేక్షకులను కనువిందు చేసింది. అలాగే "ధోనీ" చిత్రంలో నటించిన సుశాంత్‌ ను చూసి మహేంద్ర సింగ్ ధోని అనుకోని "ధోనీ భాయ్‌..సాక్షి వదిన ఎలా ఉన్నారు" అంటూ అడగడం ఆకర్షణగా నిలిచింది. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements