త్వరలో అమరావతిలో "బుద్ధ ఫెస్టివల్"..

     Written by : smtv Desk | Wed, Jan 24, 2018, 02:31 PM

త్వరలో అమరావతిలో

అమరావతి, జనవరి 24 : ప్రపంచ శాంతి నిమిత్తం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు "బుద్ధ ఫెస్టివల్" నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలోనే గండికోటలో రోప్ వేను ఏర్పాటు చేస్తున్నామని, పర్యాటక శాఖ బుద్ధిజాన్ని ప్రమోట్ చేస్తోందని తెలిపారు.

బుద్ధ ఫెస్టివల్‌ కార్యక్రమానికి 2000మంది మౌగ్స్ వస్తున్నారని, వారు 100 ప్రదేశాలలో పర్యటిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ పర్యాటక శాఖ తరపున పెద్దఎత్తున ఉద్యోగాల రూపకల్పనకు శ్రీకారం చుట్టనున్నామని అఖిల ప్రియ వెల్లడించారు. ఈ మేరకు అలీబాబా కంపెనీతో ఐటీ శాఖ, పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements