జొహనెస్బర్గ్, జనవరి 25 : వాండరర్స్ పిచ్ పై కోహ్లి సేన తమ పేలవ ఆట తీరును పునరావృతం చేసింది. ఒక వైపు కోహ్లి (54), పుజారా(50), సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలో చూపించిన మిగతా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు ఎంత తొందరగా చేరుతామో అన్నట్లుగా ఆడారు. ఫలితంగా సౌతాఫ్రికా తో జరుగుతున్న చివరి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 187 పరుగులకే కుప్ప కూలిపోయింది.
లోయర్ ఆర్డర్ లో భువనేశ్వర కుమార్ తనదైన శైలిలో (30) పరుగులు చేయడంతో ఆ స్కోర్ లభించింది. ప్రోటిస్ జట్టులో రబాడ 3, మోర్కెల్ 2, ఫిలాండర్ 2, ఫెహ్లుక్వాలియో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డీన్ ఎల్గర్ (4), నైట్ వాచ్మన్ రబాడ (0) క్రీజులో ఉన్నారు.