యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ ఏడాదిని అస్సలు మరచిపోలేరు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన హీరోగా నటించిన కార్తికేయ 2 విడుదలై పాన్ ఇండియా రేంజ్లో ఘన విజయాన్ని సాధించింది. నిఖిల్ను హీరోగా నెక్ట్స్ రేంజ్కి తీసుకెళ్లిన చిత్రమిది. ప్రస్తుతం ఆయన తాజా చిత్రం 18 పేజీస్. నిఖిల్తో కార్తికేయ 2లో జత కట్టిన అనుపమ పరమేశ్వరన్ ‘18 పేజీస్’లో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా వర్క్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకుమరో యాడ్ ఆన్ కానుంది. అదేంటంటే.. తమిళ హీరో శింబు ‘18 పేజీస్’చిత్రంలో ఓ పాట పాడుతున్నారు.
శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మన్మథుడు, వల్లభ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆయన మెప్పించారు. హీరోగానే కాదు.. శింబు మంచి సింగర్ కూడా. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా , మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు, రామ్ హీరోగా నటించిన ది వారియర్ చిత్రాల్లో శింబు పాటలను పాడిన సంగతి మనకు తెలుసిందే. తాజాగా ఈ లిస్టులో ‘18 పేజీస్’చేరనుంది. ఈ సినిమాలో ‘టైమ్ ఇవ్వు పిల్లా టైమ్ ఇవ్వు’అనే పాటను శిలంబరసన్ అలియాస్ శింబు పాడారు. త్వరలోనే ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. సుకుమార్ రైటింగ్స్, జీఏ 2 పిక్చర్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి కథను అందించారు. రీసెంట్గా ‘18 పేజీస్’ చిత్రం నుంచి విడుదలైన ‘నన్నయ్య రాసిన ..’ అనే పాటకు, అంతకు ముందే విడుదలైన టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘18 పేజీస్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కార్తికేయ 2 సక్సెస్ అందించిన కాన్ఫిడెంట్తో నిఖిల్ నెక్ట్స్ స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. స్పై చిత్రం ద్వారా ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే.