ఇటీవల కాలంలో ఆన్లైన్ ఆఫర్లు పెరిగాయి. ఈ కామర్స్ సంస్థలు క్యాష్ బ్యాక్తో పాటూ మరికొన్ని ఆఫర్లను ప్రకటిస్తోంది. అంతేకాదు ఇప్పుడు మొబైల్స్ నుంచి కూరగాయల వరకు అన్నీ హోడ్ డెలివరీ చేస్తున్నారు. కానీ ఒక్కోసారి ఆన్లైన్ ఆర్డర్ల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. మొబైల్ బుక్ చేస్తే సబ్బులు, రాళ్లు రావడం వంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా అనంతపురంలో ఇలాంటి తరహా ఘటన మరొకటి జరిగింది. అనంతపురం పాతూరు భాగ్యనగర్కు చెందిన మస్తాన్వలి ఆన్లైన్లో ఓ ఈ కామర్స్ సంస్థ నుంచి ఈ నెల 14న రూ.34 వేలు విలువ చేసే మొబైల్ బుక్ చేశారు. ఈ నెల 17న డెలివరీ బాయ్ ఆ బాక్సును తెచ్చి ఇచ్చాడు. ఆ బాక్సు తీసుకోగానే బాగా బరువుగా అనిపించింది. అతడికి అనుమానం రావడంతో ముంద జాగ్రత్తగా బాక్స్ ఓపెన్ చేసే సమయంలో వీడియో తీశాడు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో మొబైల్ బదులు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కనిపించడంతో అవాక్కయ్యారు. మస్తాన్వలి వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసి తనకు మొబైల్ బదులు షాంపూ బాటిల్ వచ్చిందని చెప్పారు. ఇటు డెలివరీ చేసిన స్టోర్ మేనేజర్కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో స్టోర్ మేనేజర్ రెండు మూడు రోజుల్లో బాధితుడికి డబ్బులు రీఫండ్ అవుతాయని చెప్పారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు చాలానే జరిగింది. ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. మరొకటి వస్తోంది.