జయపుర, జనవరి 26 : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఫోన్ లో మాట్లాడిన మాటలను ఓ ప్రయాణికుడు తప్పుగా అర్ధం చేసుకొని విమానాశ్రయంలో గందరగోళానికి కారణమయ్యాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. శశి థరూర్ తన సోదరిని రిసీవ్ చేసుకోవడానికి జయపుర విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఆయన ఫోన్ లో మాట్లాడుతూ.. "ఢిల్లీ నుండి నా సిస్టర్ వస్తోంది. ఆమె కోసం విమానాశ్రయంలో ఎదురుచూస్తున్నా" అన్నారు.
అయితే "సిస్టర్" అన్న మాటను "పిస్టోల్" అని అర్ధం చేసుకున్న ఓ ప్రయాణికుడు ఏం చేయాలో తెలీక పక్కనే ఉన్న ప్యానిక్ బటన్ నొక్కాడట. ఇంక అంతే మొత్తం ఎయిర్పోర్ట్లో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శశి థరూర్ వద్దకు చేరుకొని విచారించారు. ఆయన జరిగిన విషయాన్ని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.