దక్షిణకొరియా, జనవరి 26 : దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని సియోల్కు 270 కిలోమీటర్ల దూరంలో గల మిర్యంగ ప్రాంతంలో గల ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని 41 మంది దుర్మరణం చెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.