విజయం ముంగిట విరాట్ సేన..

     Written by : smtv Desk | Sat, Jan 27, 2018, 10:54 AM

విజయం ముంగిట విరాట్ సేన..

జొహనెస్‌బర్గ్‌, జనవరి 27 : ఎట్టకేలకు భారత్ జట్టు దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లో విజయం ముంగిట నిలిచింది. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ లో కోహ్లి సేన ఆతిథ్య జట్టుకు కష్టతరమైన 240 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 49/1తో ఆట ఆరంభించిన టీమిండియా జట్టులో అజింక్య రహానె (48), విరాట్‌ కోహ్లీ (41) సఫారీ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్నారు.

ఓ వైపు పిచ్ పేస్ కు వీపరితంగా సహకరించడంతో భారత్ బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడిన పోరాట పటిమ చూపించారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ లో భువి (33), షమి (27) మెరుపులు మెరిపించి స్కోరును 247కు చేర్చారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ కు చాలా ఇబ్బంది పడ్డారు. పిచ్ స్పందిస్తున్న తీరును గమనించిన అంపైర్లు మ్యాచ్ ను ఆరగంట ముందే నిలిపేశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ఈ రోజు మ్యాచ్ యథాతథంగా జరగనున్నట్లు అధికారక ప్రకటన వెలువడింది.





Untitled Document
Advertisements