బస్సు బోల్తా.. 13 మంది మృతి..

     Written by : smtv Desk | Sat, Jan 27, 2018, 11:48 AM

బస్సు బోల్తా.. 13 మంది మృతి..

ముంబయి, జనవరి27: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ స౦ఘటన మహారాష్ట్రలో ని కోల్హాపూర్‌లో జరిగింది. ఈ ఘటన లో 13 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన కథన౦ ప్రకారం నిన్న అర్ధరాత్రి గణపతిపూలే నుంచి పుణె వెళ్తున్న బస్సు కోల్హాపూర్‌ ప్రాంతంలోని పంచగంగ నది సమీపం లో శివాజీ వంతెనపై వెళ్తుండగా అదుపుతప్పి నదిలో పడింది.

ఈ సమయ౦ లో బస్సులో 16 మంది ప్రయాణిస్తున్నారు. అయితే సమాచార౦ తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కాపాడే ప్రయత్నం చేసారు.ఈ దుర్ఘటన లో 12 మంది అక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.





Untitled Document
Advertisements