ధర్మాన్ని..ధర్మభాయ్ ని అంటున్న.. సుప్రీం హీరో

     Written by : smtv Desk | Sat, Jan 27, 2018, 05:46 PM

ధర్మాన్ని..ధర్మభాయ్ ని అంటున్న.. సుప్రీం హీరో

హైదరాబాద్, జనవరి 27 : ధర్మాన్ని..ధర్మభాయ్ ని అంటూ సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన హీరోగా, వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇంటెలిజెంట్’. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్‌ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకగా నటిస్తుంది. కాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ టాలీవుడ్‌ నటుడు బాలకృష్ణ ఈ రోజు విడుదల చేశారు.

టీజర్ ఆద్యంతం ఫుల్ మాస్ అంశాలతో నిండి ఉంది. ముఖ్యంగా సాయి ధరమ్‌ పలికే సంభాషణలు తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. టీజర్ లో ‘ఇక మీదట పేదోడికి ప్లాట్‌ఫాం.. ధర్మాభాయ్‌.కామ్‌’ అన్న డైలాగ్ హైలైట్ గా నిలిచింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది.





Untitled Document
Advertisements