హైదరాబాద్, జనవరి 28 : ప్రముఖ కథానాయిక తమన్నా.. నగల దుకాణాన్ని ప్రారంభించడానికి హిమాయత్నగర్కు వచ్చారు. ఆమె అభిమానులకు అభివాదం చేస్తున్న క్రమంలో ఓ యువకుడు ఆమెపై చెప్పు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ముషీరాబాద్ కు చెందిన ఆ యువకుడు కరిముల్లాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తమన్నా చాలా రోజుల నుండి మంచి సినిమాలు చేయడం లేదని అందుకే తను నిరసన తెలియజేసినట్లు వాపోయాడు. అతను ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డాడని, అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.