ఎట్టకేలకు చేధించిన బొడ్డుపల్లి మర్డర్ మిస్టరీ

     Written by : smtv Desk | Sun, Jan 28, 2018, 04:52 PM

ఎట్టకేలకు చేధించిన బొడ్డుపల్లి మర్డర్ మిస్టరీ

నల్గొండ, జనవరి 28 : నల్గొండ పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఒక మిర్చి బండి వద్ద జరిగిన గొడవ చివరికి ఇలా హత్యకు దారి తీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య కేసులో ఏ-1 నిందితుడిగా చింతకుంట్ల రాంబాబు ఉండగా, ఏ-2 మాండ్ర మల్లేష్‌, ఏ-3 ఆవుల శరత్‌రాజు, ఏ-4 బాషపాక దుర్గయ్య, ఏ-5 కత్తుల చక్రి, ఏ-6 రామునూరి సతీష్‌, ఏ-9 మెరుగు గోపి, ఏ-10 మాతంగి మోహన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మిగిలిన ఏ-7 మాండ్ర మహేష్‌, ఏ-8 మిట్టపల్లి సాయి, ఏ-11 ప్రసాద్‌లు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ హత్యకేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని కేవలం కాల్‌లిస్టు ఆధారంగానే విచారణ జరిపామని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు.





Untitled Document
Advertisements