రామ్ సరసన రెండోసారి అనుపమా..!

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 01:53 PM

రామ్ సరసన  రెండోసారి అనుపమా..!

హైదరాబాద్, జనవరి 29 : 'అఆ' సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ 'శతమానం భవతి' సినిమా లో శర్వానంద్ తో జోడికట్టి తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకొని.. వరుస విజయాలను అందుకుంటుంది. తాజాగా ఆమెను దిల్ రాజు సినిమాలో రామ్ కు జోడిగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇది వరకే అనుపమా రామ్ తో 'ఉన్నది ఒకటే జిందగీ'లో నటించారు.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుండి ప్రారంభించేందుకు చర్చలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నాని సరసన 'కృష్ణార్జున యుద్ధం' తో పాటు దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కిస్తున్న సినిమాలోను నటిస్తున్నారు.





Untitled Document
Advertisements