ప్రతి ఒక్కరు రేపు మౌనం పాటించాలి : ప్రభుత్వం ఆదేశం

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 05:11 PM

ప్రతి ఒక్కరు రేపు మౌనం పాటించాలి : ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, జనవరి 29 : తెలంగాణ ప్రభుత్వం.. రేపు ప్రతి ఒక్కరు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రకటన జారీ చేసింది. స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వ్యక్తుల్లో జాతిపిత మహాత్మాగాంధీ ఒకరని, రేపు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అందరు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులకు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. అంతేకాకుండా ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలు సైతం నిలిపివేయాలని సూచించింది. ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌనం పాటించాలని అధికారులను ఆదేశించింది.





Untitled Document
Advertisements