న్యూఢిల్లీ, జనవరి 30: ఐపీఎల్ -11 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఘనంగా ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుండి మే 27 వరకు జరగనున్న ఈ మహాసమరం కోసం ఆయా ఫ్రాంఛైజీలు స్టార్ క్రీడాకారులను కొనుగోళ్లు చేశారు. కాగా ప్రీతిజింటా నేతృత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరు మారబోతుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తమ జట్టు పేరు మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కింగ్స్ ఎలెవన్ సహ యజమాని బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నట్లుగా బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.