హైదరాబాద్, జనవరి 30 : వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి.. గణతంత్ర వేడుకల్లో చేసిన ప్రసంగం ఇటీవల చర్చనీయా౦శమైంది. ఆమె హన్మకొండలోని పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగం చేస్తున్నంతసేపు అకారణంగా నవ్వడం, తడబడడం, మళ్ళీ మధ్యలో "ఇట్స్ ఫన్నీ" అంటూ వ్యాఖ్యానించడం వైరల్ గా మారింది. ఆమ్రపాలి ప్రసంగం చర్చలకు దారి తీసిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ సింగ్ ఈ మేరకు ఆమెతో ఫోన్లో మాట్లాడారు. గణతంత్ర వేడుకల్లో అలా ఎందుకు జరిగిందంటూ ఆరా తీశారు. దీంతో ఆమ్రపాలి కొన్ని పదాలను ఉచ్చరించడంలో తడబాటు ఎదురైందని ఆమె సీఎస్కు వివరణ ఇచ్చినట్టు సమాచారం.