రెండు నిమిషాలు మౌనంగా "మహా నగర౦"

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 03:56 PM

రెండు నిమిషాలు మౌనంగా

హైదరాబాద్, జనవరి 30 : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మౌనం పాటించారు. అలాగే ప్రభుత్వ౦ ఆదేశాల మేరకు రహదారులపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేసి మౌనం పాటించినట్లు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ రవీందర్ వెల్లడించారు.

నగరంలోని ప్రధాన కూడలైన ఖైరతాబాద్ సహా పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి వెళ్లే వాహనాలను.. అటువైపు నుంచి సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్లే వాహనాలను రెండు నిమిషాల పాటు రెడ్‌సిగ్నల్ వేసి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులతో పాటు వాహనదారులు, ప్రజలు గాంధీకి నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.





Untitled Document
Advertisements