ముంబయి, జనవరి 31 : భారత నావికాదళంలోకి స్కార్పీన్ శ్రేణికి చెందిన మూడో ఐఎన్ఎస్ కర్నాజ్ ముంబైలో జల ప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా సతీమణి రీనా లంబా స్కార్పీన్ శ్రేణికి చెందిన మూడో ఐఎన్ఎస్ కర్నాజ్ జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఈ జలాంతర్గామిని ఏడాది పాటు క్షుణ్ణంగా పరీక్షించనున్నట్లు సునీల్ లంబా తెలిపారు. దీనిని ముంబయిలోని(ఎండీఎల్) మజగావ్ డాక్యార్డ్లో నిర్మించారు.