న్యూఢిల్లీ, జనవరి 31: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో కొద్ది సేపు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ప్రాణభయంతో వీథుల్లోకి పరుగులుతీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైంది. దిల్లీతో పాటు కశ్మీర్, అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్, హిమాచల్ ప్రదేశ్, తదితర ప్రాంతాల్లోనూనూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ - తజకిస్థాన్ మధ్య హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.