అమరావతి, ఫిబ్రవరి 2 : ఏపీలో ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ ఐటీ శాఖల మ౦త్రి నారా లోకేష్.. అమెజాన్ సహా శ్యా౦సంగ్, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ మేరకు మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఏపీలో శాంసంగ్ గ్లోబల్ ఈ కామర్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో క్లౌడ్ సర్వీసెస్, ఐఓటికు భారీగా డిమాండ్ పెరిగిందన్న ఆయన.. ఇంటర్నెట్ ల్యాండింగ్ పాయింట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.