నేను పార్టీలో చేరాననే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది..పొంగులేటి

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 04:00 PM

నేను పార్టీలో చేరాననే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది..పొంగులేటి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యకాలంలో తన సొంత పార్టీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం పార్టీ పై అసంతృప్తితో ఉన్నప్పటికీ పార్టీ జెండా ఏదైనా తన అజెండా మాత్రం ఒకటేనని అన్నారు. ఎన్నికల్లో తన వెంట వచ్చిన వారిని గెలిపించుకోవడమే తన అజెండా అని చెప్పారు. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసినప్పుడు ఏం మాట్లాడాననేది త్వరలోనే తెలుస్తుందని అన్నారు. తాను ఏ పార్టీలో చేరాననే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు. పార్ఠీ అధిష్ఠానంపై ఆయన నేరుగానే విమర్శలు సంధించారు. పార్టీలో తనకు చాలా అవమానం జరిగిందని చెప్పారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరిగింది. తాజాగా షర్మిలతో ఆయన భేటీ అయ్యారు. ఇంకోవైపు వైఎస్సార్టీపీలో చేరుతానని పొంగులేటి తనకు మాట ఇచ్చారని షర్మిల చెప్పడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్టయింది. కానీ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది తనకు తానుగా నోరు విప్పి చెప్పే వరకు ఎదురుచుడాల్సిందే.





Untitled Document
Advertisements