ఆరుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 01:40 PM

 ఆరుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్..

నెల్లూరు, ఫిబ్రవరి 2: ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మల్లెంకొండ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు మూడు కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు.

తమిళనాడుకు చెందిన రవేక్‌ కులాంతైరాజ్‌, తమీమ్‌ అన్సారీ, సయ్యద్‌ ఇబ్రహీం, ఇక్బాల్‌, నాగూర్‌ గనిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు కోట్ల రూపాయల విలువ చేసే 138 ఎర్రచందనం దుంగలను, ఇన్నోవా, స్కార్పియో, ద్విచక్రవాహనం, 20సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ డి.విఠలేశ్వర్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements