అభివృద్ధి పనులపై కేటీఆర్ సమీక్ష...

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 06:34 PM

అభివృద్ధి పనులపై కేటీఆర్ సమీక్ష...

హైదరాబాద్, ఫిబ్రవరి 2 : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. అభివృద్ధి పనులపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల పురపాలక సంస్థ చేపట్టిన కొత్తచెరువు అభివృద్ది పనుల నమూనాలను పరిశీలించారు. అలాగే జిల్లా గ్రంథాలయానికి త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ఇండోర్ స్టేడియానికి స్థల సేకరణ చేపట్టాలని, సిరిసిల్లాలో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో పురపాలక చైర్ పర్సన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements