బాలీవుడ్ బాద్ షాకు షాక్..!

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 12:51 PM

బాలీవుడ్ బాద్ షాకు షాక్..!

ముంబై, ఫిబ్రవరి 3 : బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఆపదలో పడ్డారు. ఆయనకు సంబంధించిన ఇంటిని జప్తు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తప్పుడు ధృవపత్రాలతో భూమిని కొనుగోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెంట్ మోరేశ్వర్.. ముంబైలోని అలీబాగ్ ప్లాట్లను షారుఖ్ తప్పుడు ధృవపత్రాలతో కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులకు తెలిపారు. ఈయన గతంలో షారుఖ్ వద్ద పనిచేశారు. ఈ క్రమంలో విలాసవంతంగా నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఈ భవనాన్ని అధికారులు జప్తు చేసినట్లు పేర్కొన్నారు.





Untitled Document
Advertisements