డిప్యూటీ సీఎంకు ఎంపీ కవిత పరామర్శ

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 03:29 PM

డిప్యూటీ సీఎంకు ఎంపీ కవిత పరామర్శ

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రో సమస్యతో బాధపడుతున్న ఆయన రెండురోజుల క్రితం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమూద్ అలీని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడిందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు.





Untitled Document
Advertisements