తనకు, తన కుటుంబానికి జడ్ ప్లస్ భద్రత కోరిన అంబానీ.. స్పందించిన సుప్రీంకోర్టు

     Written by : smtv Desk | Wed, Mar 01, 2023, 12:33 PM

తనకు, తన కుటుంబానికి జడ్ ప్లస్ భద్రత కోరిన అంబానీ.. స్పందించిన సుప్రీంకోర్టు

సెలబ్రీటిలకు వ్యక్తిగత బద్రత అనేది చాల ముఖ్యం. కొంతమంది తమ సొంతంగా సెక్యురిటీని నియమించుకుంటారు. ఇది ఒక పరిది వరకు బద్రత కలిపిస్తుంది. కానీ దేశంలోనే అత్యంత కీలక స్థానాలలో ఉన్న వారికి మాత్రం ఈ సేక్యురిటి సరిపోదు. వారికి మరింత పటిష్టమైన రక్షణ వ్యవస్థ అవసరం. అటువంటి రక్షణ వ్యవస్థని కేవలం ప్రభుత్వం వారే కలిపించగలరు. అందుకే భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి జడ్ ప్లస్ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ముంబైలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారికి భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ ముకేశ్ అంబానీ భరిస్తారని కోర్టు తెలిపింది.

ముకేశ్ కుటుంబానికి భద్రతపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులు కృష్ణ మురారి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం అంబానీ కుటుంబానికి దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ భద్రత కల్పించాలని పేర్కొంది. అలాగే వారు విదేశాలకు వెళ్లినప్పుడు హోం శాఖ వారికి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది.





Untitled Document
Advertisements