బీజేపీ ఎంపీ హుకుమ్‌ సింగ్‌ కన్నుమూత..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 11:58 AM

బీజేపీ ఎంపీ హుకుమ్‌ సింగ్‌ కన్నుమూత..

నోయిడా, ఫిబ్రవరి 4 : బీజేపీకు చెందిన ఎంపీ హుకుమ్‌ సింగ్‌ (79) శనివారం సాయంత్రం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా హుకుం సింగ్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మంత్రిగానూ పనిచేశారు. 'బాబూ సాహెబ్'గా ఆయనను అభిమానులు పిలుచుకుంటారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా సంతాపం తెలిపారు.





Untitled Document
Advertisements