భారత్ లో మొట్టమొదటి ర్యాపిడ్ రైల్.. త్వరలో అందుబాటులోకి ర్యాపిడిక్స్

     Written by : smtv Desk | Wed, Apr 12, 2023, 11:48 AM

భారత్ లో మొట్టమొదటి ర్యాపిడ్ రైల్.. త్వరలో అందుబాటులోకి ర్యాపిడిక్స్

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఎన్నో అత్యుతమమైన ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, ఆకాశ మార్గాలు కొత్తగా ఏర్పాటు అవుతున్నాయి. అలాగే సరికొత్త టెక్నాలజీతో వాహానాలను సైతం ఆవిష్కరిస్తూ దూసుకుపోతుంది భారత్. ఇందులో భాగంగానే తాజాగా దేశంలో మొట్టమొదటి ర్యాపిడ్ రైలు పరుగులు పెట్టనుంది. ఇది ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో నడవనుంది. ఈ మార్గంలోని 82-కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ లో సేవలు అందించనుంది. దీనికి రాపిడిక్స్ అని పేరు పెట్టినట్లు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ప్రకటించింది. పట్టణ మెట్రో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న ఎన్సీఆర్టీసీ రాపిడిక్స్ ద్వారా దేశంలో మొదటి సెమీ-హైస్పీడ్ ప్రాంతీయ రైలు సేవలకు శ్రీకారం చుట్టనుంది.

వేగంతోపాటు అధునాతన సాంకేతికతతో నడిచే రాపిడిక్స్ రైలుతో ప్రయాణ సమయం తగ్గనుంది. 2025 నాటికి ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మార్గంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఎన్సీఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ముందు ఈ ఏడాదిలో సాహిబాబాద్–దుహై మధ్య 17 కిమీ పొడవైన ప్రాధాన్యతా విభాగంలో నడపాలని చూస్తోంది. ఈ రైలు కోసం మీరట్‌లో ప్రత్యేకంగా 8 స్టేషన్‌లు నిర్మించనుంది.





Untitled Document
Advertisements