'విరూపాక్ష' సంచలనం విజయం..16.36 కోట్ల షేర్

     Written by : smtv Desk | Mon, Apr 24, 2023, 12:52 PM

 'విరూపాక్ష' సంచలనం విజయం..16.36 కోట్ల షేర్

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష' సంచలనం విజయం సాధించింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సాయితేజ్ కెరీర్ లో బిగ్గెట్ హిట్ గా మారింది. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఈ చిత్రానికి రూ. 5.77 కోట్ల వసూళ్లు వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల్లోనే ఇరు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. బాలకృష్ణ నటించిన 'వీరసింహా రెడ్డి' రెండో రోజు రూ.5.12 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగా.. విరూపక్ష అంతకంటే ఎక్కువ సాధించడం గమనార్హం.





Untitled Document
Advertisements