హోం మంత్రి అమిత్ షాపై కర్ణాటక ఎన్నికల వేళ పోలీసు కేసు

     Written by : smtv Desk | Thu, Apr 27, 2023, 11:38 AM

హోం మంత్రి అమిత్ షాపై కర్ణాటక ఎన్నికల వేళ పోలీసు కేసు

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, డా. పరమేశ్వర్, డీకే శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్ష పార్టీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నించారంటూ అమిత్ షాపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

అనంతరం, సుర్జేవాలో మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని అమిత్ షా అన్నారు. అంతేకాదు, పీఎఫ్ఐ సంస్థపై నిషేధం ఎత్తేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చేయడమంటే రాష్ట్రంలో మతసామరస్యాన్ని చెగడొట్టడమే, కాంగ్రెస్‌కు దురుద్దేశాలు ఆపాదించడమే’’ అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.

మంగళవారం బాగాల్‌‌కోట్‌లో జరిగిన ఓ ర్యాలీలో అమిత్ షా ప్రతిపక్షంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘‘కాంగ్రెస్‌కు పొరపాటును ఓటు వేసినా, రాష్ట్రంలో అవినీతి మునుపెన్నడూ చూడనిస్థాయికి చేరుకుంటుంది. వారసత్వ రాజకీయాలు, ఆశ్రితపక్షపాతం హెచ్చరిల్లుతాయి. అల్లర్లు చెలరేగి యావత్ రాష్ట్రం అవస్థల పాలవుతుంది’’ అని షా మండిపడ్డారు.





Untitled Document
Advertisements