సిమ్లాలోని హనుమాన్ ఆలయంలో ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు..

     Written by : smtv Desk | Sat, May 13, 2023, 10:17 AM

సిమ్లాలోని హనుమాన్ ఆలయంలో ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన పార్టీ ప్రస్తుతం కొన్ని చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితులలో కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. ఆమె ప్రార్థనలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ.. దేశ, కర్ణాటక రాష్ట్ర శాంతి, సౌభ్రాతృత్వం కోసం హనుమాన్ ఆలయంలో ప్రియాంక ప్రార్థనలు నిర్వహించారని తెలిపారు. మరోవైపు కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా స్థానాల్లో ఆధిక్యతలోకి వెళ్లింది. 224 స్థానాలకు గాను ప్రస్తుతం 121 స్థానాల్లో లీడ్ లో ఉంది. మరోవైపు ఎన్నికల ట్రెండ్స్ ను రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.






Untitled Document
Advertisements